19, మార్చి 2012, సోమవారం

వసంతోత్సవానికి స్వాగతం

శ్రీ నందన నామ సంవత్సర ’ఉగాది’ పర్వదిన సందర్భంగా 21 మార్చి 2012 నాడు సాయంత్రం 6 గం//లకు ’నవ్య సాహితీ సమితి’ నిర్వహణలో భాగ్యనగరంలోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో జరుపనున్న ’వసంతోత్సవం’ కార్యక్రమానికి జంట నగరాలలోని సాహిత్యాభిమానులకు ఇదే మా ఆహ్వానం. ఈ కార్యక్రమంలో వివిధ ప్రక్రియలలోని సాహితీ ప్రముఖులకు పురస్కార ప్రదానం, ప్రముఖ కవులచే ’కవి సమ్మేళనం’ ప్రధానాంశాలుగా ఉంటాయి. ’జ్ఞాన పీఠ’ పురస్కార గ్రహీత డా సి. నారాయణరెడ్డి, టి.టి.డి పూర్వ కార్య నిర్వహణాధికారి డా. కె.వి, రమణాచారి, ప్రముఖ కవి డా. జె. బాపురెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొంటారు.