30, ఏప్రిల్ 2012, సోమవారం

ఈనాటి పత్రికలలో...


నిన్న మేము నిర్వహించిన మా గురువుగారి జయంతి మహోత్సవ వివరాలను నేటి దినపత్రికలలో చదివి తెలుసుకోండి. - డా. ఆచార్య ఫణీంద్ర ............................................................................................................ సాక్షి :
ఈనాడు :
నమస్తే తెలంగాణ :

26, ఏప్రిల్ 2012, గురువారం

సాహిత్యాభిమానులకు స్వాగతం!


జంట నగరాలలోని సాహిత్యాభిమానులు, మహాకవి ’నండూరి రామకృష్ణమాచార్య’ శిష్యులు,అభిమానులు అందరూ 29 ఏప్రిల్ 2012 నాడు సాయంత్రం ఆరు గంటలకు సుల్తాన్ బజార్ లోనున్న ’శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం’లో నిర్వహించబడుతున్న ఆ మహాకవి జయంతి మహోత్సవానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆ కార్యక్రమం ఆహ్వాన పత్రిక మీ కోసం -
- డా. ఆచార్య ఫణీంద్ర, ప్రధాన కార్యదర్శి, నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం

23, ఏప్రిల్ 2012, సోమవారం

పద్య కవితా పురస్కారం - 2012


వార్తా విశేషాలు : ఏప్రిల్ 2012
2012 వ సంవత్సరానికిగాను ’నండూరి రామకృష్ణమాచార్య స్మారక పద్య కవితా పురస్కారం’ సుప్రసిద్ధ పద్యకవి శ్రీ దుగ్గిరాల రామారావుకు ప్రదానం చేయనున్నట్టు ’నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం’ ప్రధాన కార్యదర్శి ’డా. ఆచార్య ఫణీంద్ర’ ప్రకటించారు. ’అమృత కలశం’, ’ఆంధ్ర రస మంజరి’, ’కామేశ్వరీ వైభవం’ వంటి ఎన్నో సుమధుర కావ్యాలను వెలయించిన రామారావు గారు యువకవిగానే, తిరుపతి వేంకట కవులలో ఒకరైన ’చెల్లపిళ్ళ వేంకట శాస్త్రి’ గారి ఆశీస్సులను అందుకొన్నారు. చెన్నై వాస్తవ్యులుగా ఉన్నప్పుడు ఆయనకు 'ఆరుద్ర', 'ఆత్రేయ'లతో బాటు 'మద్రాసు విశ్వ విద్యాలయం' తెలుగు పండితులు అనేకులతో సాహచర్యం లభించింది. ఆ తరువాత హైదరాబాదు చేరుకొన్నాక, 'డా. సి.నారాయణ రెడ్డి', 'డా. నండూరి రామకృష్ణమాచార్య' వంటి మహాకవుల ప్రశంసల నందుకొన్నారు. దుగ్గిరాల వారు తమ 'అమృత కలశం' కావ్యానికి 'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం' పురస్కారం అందుకొన్నారు. దుగ్గిరాల రామారావు గారికి ఈ నెల 29 నాడు హైదరాబాదులోని 'శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం'లో ’నండూరి రామకృష్ణమాచార్య 92వ జయంత్యుత్సవ సభ’లో నండూరి వారి స్మారక పద్య కవితా పురస్కారాన్ని పలువురు ప్రముఖ కవి పండితుల సమక్షంలో ప్రదానం చేయబడుతుందని ఆచార్య ఫణీంద్ర వివరించారు.