9, జూన్ 2016, గురువారం

వైభవంగా పురస్కారాల ప్రదానం

ప్రముఖ కవి, అంతర్జాతీయ విఖ్యాత భూభౌతిక శాస్త్రవేత్త ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు నెలకొల్పిన వి.యల్.యస్. విజ్ఞాన సారస్వత పీఠం - హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో 8 జూన్ 2016 నాడు "వేము అన్నపూర్ణ జ్ఞాపక పద్యకవితా పురస్కారాల ప్రదానోత్సవం" నిర్వహించింది. ప్రముఖ రచయిత్రి, ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు శ్రీమతి మలయవాసిని గారికి మరియు ప్రముఖ కవి, బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు శ్రీ రావికంటి వసునందన్ గారికి ఈ పురస్కారాలను ప్రదానం చేసారు. ఈ సభలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న నేను ఆచార్య వి. యల్.యస్. భీమశంకరం గారి పద్యకావ్యాలపై ప్రసంగించాను. ఆ కార్యక్రమం గురించి వివిధ పత్రికలలో ప్రచురించబడిన వివరాలు సాహిత్యాభిమానుల కోసం ..
- డా. ఆచార్య ఫణీంద్ర.