17, ఆగస్టు 2017, గురువారం

"నండూరి రామకృష్ణమాచార్య స్మారక సాహిత్య పురస్కారం"

మా గురువుగారు డా. నండూరి రామకృష్ణమాచార్య దివంగతులయ్యాక, వారి పేర అంతకు ముందే ఏర్పాటు చేయబడిన "నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం" ద్వారా 2004 సంవత్సరం నుండి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఒక ప్రముఖ సాహితీమూర్తికి "నండూరి రామకృష్ణమాచార్య స్మారక సాహిత్య పురస్కారం" ప్రదానం చేయబడుతూ ఉంది. ఆ వివరాలు సాహిత్యాభిమానుల కోసం ...

- డా. ఆచార్య ఫణీంద్ర

   ప్రధాన కార్యదర్శి, 

నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం 

  హైదరాబాద్. 



















---------------------------------------------------------------------------------------------

2004   డా. ఆశావాది ప్రకాశరావు, ప్రముఖ కవి, అవధాని.

2005   శ్రీ శిష్ట్లా వెంకటరావు, పద్య విద్యా ప్రచారకులు.

2006   డా. రాపాక ఏకాంబరాచార్య, అవధాన విద్యా పరిశోధకులు.

2007   డా. మల్లెమాల, ప్రముఖ కవి, సినీ నిర్మాత.

2008   ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం, ప్రముఖ కవి, భూభౌతిక శాస్త్రవేత్త.

2009   శ్రీ ముదివర్తి కొండమాచార్యులు, ప్రముఖ కవి.

2010   శ్రీ నల్లాన్ చక్రవర్తుల శేషాచార్యులు, ప్రముఖ కవి.

2011   డా. తిరుమల శ్రీనివాసాచార్య, ప్రముఖ కవి.

2012   శ్రీ దుగ్గిరాల రామారావు, ప్రముఖ కవి.

2013   డా. మేడసాని మోహన్, ప్రముఖ అవధాని.

2014   ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, ప్రముఖ కవి, విశ్వవిద్యాలయాచార్యులు.

2015   డా. జె. బాపురెడ్డి, ప్రముఖ కవి, ఐ.ఏ.యస్. అధికారి.

2016   శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీ నరరసమ్మ, ప్రముఖ కవయిత్రి.

2017   శ్రీ డి. రంగారావు, ప్రముఖ ఆంగ్ల రచయిత, అనువాదకులు.

---------------------------------------------------------------------------------------------


11, మే 2017, గురువారం

గురువు గారి 97వ జయంతి సభా విశేషాలు

29 ఏప్రిల్ 2017 నాడు సాయంత్రం 6.30 గం||లకు హైదరాబాదులో "శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం"లో నిర్వహింపబడిన,  మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్యుల 97వ జయంతి సభా విశేషాలు :























































































30, ఏప్రిల్ 2017, ఆదివారం

నండూరి రామకృష్ణమాచార్య జయంతి సభ

నిన్న మా గురువు గారు కీ. శే. డా. నండూరి రామకృష్ణమాచార్య జయంతి సభ హైదరాబాదులోని "శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం"లో  వైభవంగా జరిగింది. ఈమారు "నండూరి రామకృష్ణమాచార్య స్మారక సాహిత్య పురస్కారం" ప్రముఖ ఆంగ్ల రచయిత, అనువాదకులు ఆచార్య డి. రంగారావు గారికి ప్రదానం చేయబడింది.