"సందేశ దీపిక" - నిర్వహణ; సంపాదకత్వం : డా. ఆచార్య ఫణీంద్ర, ప్రధాన కార్యదర్శి
7, డిసెంబర్ 2016, బుధవారం
5, డిసెంబర్ 2016, సోమవారం
1, డిసెంబర్ 2016, గురువారం
"శ్రీమదాంధ్ర శివానంద రామాయణము " కావ్యావిష్కరణ సభ
ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు రచించిన "శ్రీమదాంధ్ర శివానంద రామాయణము (బాలకాండం)" కావ్యావిష్కరణ సభలో గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె.వి.రమణాచారి గారు.
చిత్రంలో .. ఎడమ నుండి .. డా. ఆచార్య ఫణీంద్ర (నేను), ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు, డా.జి.యం. రామశర్మ గారు, డా. రాపాక ఏకాంబరాచారి గారు, ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు, ఆచార్య పొన్నపల్లి వెంకట కృష్ణయ్య గారు మరియు చిలకమర్రి కృష్ణమాచార్యులు గారు ఉన్నారు.
22, నవంబర్ 2016, మంగళవారం
27, ఆగస్టు 2016, శనివారం
22, జులై 2016, శుక్రవారం
9, జూన్ 2016, గురువారం
వైభవంగా పురస్కారాల ప్రదానం
ప్రముఖ కవి, అంతర్జాతీయ విఖ్యాత భూభౌతిక శాస్త్రవేత్త ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు నెలకొల్పిన వి.యల్.యస్. విజ్ఞాన సారస్వత పీఠం - హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో 8 జూన్ 2016 నాడు "వేము అన్నపూర్ణ జ్ఞాపక పద్యకవితా పురస్కారాల ప్రదానోత్సవం" నిర్వహించింది. ప్రముఖ రచయిత్రి, ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు శ్రీమతి మలయవాసిని గారికి మరియు ప్రముఖ కవి, బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు శ్రీ రావికంటి వసునందన్ గారికి ఈ పురస్కారాలను ప్రదానం చేసారు. ఈ సభలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న నేను ఆచార్య వి. యల్.యస్. భీమశంకరం గారి పద్యకావ్యాలపై ప్రసంగించాను. ఆ కార్యక్రమం గురించి వివిధ పత్రికలలో ప్రచురించబడిన వివరాలు సాహిత్యాభిమానుల కోసం ..
- డా. ఆచార్య ఫణీంద్ర.
- డా. ఆచార్య ఫణీంద్ర.
2, జూన్ 2016, గురువారం
5, మే 2016, గురువారం
నండూరి రామకృష్ణమాచార్య జయంతి సభా విశేషాలు
29/4/2016 నాడు హైదరాబాదులో నారాయణగూడలోని వై.యం.సి.ఏ. ఆడిటోరియంలో జరిగిన మహాకవి కీ.శే. డా. నండూరి రామకృష్ణమాచార్యుల వారి జయంతి సభలో ప్రముఖ కవయిత్రి, భద్రాచలం వాస్తవ్యురాలు శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ గారికి ఆచార్యుల వారి స్మారక పద్య కవితా పురస్కారాన్ని ప్రదానం చేసారు ఆనాటి ముఖ్య అతిథి - ప్రముఖ పద్యకవి, అంతర్జాతీయ విఖ్యాత భూభౌతిక శాస్త్రవేత్త ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు. ఈ సభకు "తెలుగు అకాడమి" పూర్వ సంచాలకులు డా. వెలచాల కొండలరావు గారు అధ్యక్షత వహించారు. సభలో నండూరి వారు రచించిన పద్య పఠన పోటీలలో విజేతలైన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులను అందజేసారు.
- డా. ఆచార్య ఫణీంద్ర
22, ఏప్రిల్ 2016, శుక్రవారం
17, ఫిబ్రవరి 2016, బుధవారం
డా. ఎమ్.ఎల్. నరసింహారావు గారి సంతాప సభ
నిజాం వ్యతిరేక స్వాతంత్ర్య సమర యోధులు, ప్రముఖ రచయిత, హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం కార్యదర్శిగా గత 50 ఏళ్లుగా విశిష్ట సేవలందించిన డా. ఎమ్.ఎల్. నరసింహారావు గారు 12/2/2016 నాడు ఉదయం పరమపదించారు. వారి సంతాప సభ ఈ రోజు భాషానిలయంలోనే .. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కే. వి. రమణాచారి గారి అధ్యక్షతన జరిగింది. ఆచార్య రవ్వా శ్రీహరి గారు, ఆచార్య ఎస్. వి. రామారావు గారు, శ్రీ ఉడయవర్లు గారు, శ్రీ జి.ఎస్. వరదాచారి గారు, శ్రీ సి.వి. చారి గారు, శ్రీ నూతి శంకర రావు గారు, శ్రీ చీకోలు సుందరయ్య గారు, డా. ఆచార్య ఫణీంద్ర తదితరులు పాల్గొని కీర్తిశేషులు ఎమ్. ఎల్ గారికి నివాళులను అర్పించారు.
- డా. ఆచార్య ఫణీంద్ర
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)