మా గురువు గారు మహాకవి కీ. శే. నండూరి రామకృష్ణమాచార్య గారి శత జయంతి మహోత్సవాలలో భాగంగా, ప్రారంభ సభ ఆదివారం 24 అక్టోబర్ 2021 నాడు నిర్వహించబడింది. ఆ సమావేశ చిత్రాలు :
వార్తా పత్రికలలో ఆ కార్యక్రమ విశేషాలు :
"సందేశ దీపిక" - నిర్వహణ; సంపాదకత్వం : డా. ఆచార్య ఫణీంద్ర, ప్రధాన కార్యదర్శి
మా గురువు గారు మహాకవి కీ. శే. నండూరి రామకృష్ణమాచార్య గారి శత జయంతి మహోత్సవాలలో భాగంగా, ప్రారంభ సభ ఆదివారం 24 అక్టోబర్ 2021 నాడు నిర్వహించబడింది. ఆ సమావేశ చిత్రాలు :
వార్తా పత్రికలలో ఆ కార్యక్రమ విశేషాలు :
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు అధ్యక్షత వహించిన ఒక సభలో ఒక వక్త సమయాన్ని గురించి పట్టించుకోకుండా, ధారాళంగా ప్రసంగిస్తున్నాడు. మధునాపంతుల వారు కొంత సేపు ఓపిక పట్టారు. కాని ఆ వక్త తన ప్రసంగ ధోరణి నుండి బయటకు రావడం లేదు. చివరికి మధునాపంతుల వారు ప్రక్కనున్న కార్యకర్తను పిలిచి, ఆ వక్తను - "శివ భారతం" కావ్యకర్త ఇంటి పేరేమిటో .. అడుగుమని కోరారు. ఆ కార్యకర్త ఆ పని చేయగానే ... ఆ వక్త తన చేతికి ఉన్న గడియారాన్ని చూసుకొని, "చాలా సేపు మాట్లాడినట్టున్నాను. క్షమించండి." అంటూ, తన ప్రసంగాన్ని ముగించాడు.
ఇంతకీ - "శివభారతం" కావ్యాన్ని రచించిన మహాకవి పేరు "గడియారం వేంకట శేష శాస్త్రి". అదన్న మాట సంగతి.