22, సెప్టెంబర్ 2020, మంగళవారం

సాహితీ సల్లాపాలు - 4 (విన్నవి .. కన్నవి ...)

మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు అధ్యక్షత వహించిన ఒక సభలో ఒక వక్త సమయాన్ని గురించి పట్టించుకోకుండా, ధారాళంగా ప్రసంగిస్తున్నాడు. మధునాపంతుల వారు కొంత సేపు ఓపిక పట్టారు. కాని ఆ వక్త తన ప్రసంగ ధోరణి నుండి బయటకు రావడం లేదు. చివరికి మధునాపంతుల వారు ప్రక్కనున్న కార్యకర్తను పిలిచి, ఆ వక్తను - "శివ భారతం" కావ్యకర్త ఇంటి పేరేమిటో .. అడుగుమని కోరారు. ఆ కార్యకర్త ఆ పని చేయగానే ... ఆ వక్త తన చేతికి ఉన్న గడియారాన్ని చూసుకొని, "చాలా సేపు మాట్లాడినట్టున్నాను. క్షమించండి." అంటూ, తన ప్రసంగాన్ని ముగించాడు.


ఇంతకీ - "శివభారతం" కావ్యాన్ని రచించిన మహాకవి పేరు "గడియారం వేంకట శేష శాస్త్రి". అదన్న మాట సంగతి.