17, ఫిబ్రవరి 2016, బుధవారం

డా. ఎమ్.ఎల్. నరసింహారావు గారి సంతాప సభ


నిజాం వ్యతిరేక స్వాతంత్ర్య సమర యోధులు, ప్రముఖ రచయిత, హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం కార్యదర్శిగా గత 50 ఏళ్లుగా విశిష్ట సేవలందించిన డా. ఎమ్.ఎల్. నరసింహారావు గారు 12/2/2016 నాడు ఉదయం పరమపదించారు. వారి సంతాప సభ ఈ రోజు భాషానిలయంలోనే .. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కే. వి. రమణాచారి గారి అధ్యక్షతన జరిగింది. ఆచార్య రవ్వా శ్రీహరి గారు, ఆచార్య ఎస్. వి. రామారావు గారు, శ్రీ ఉడయవర్లు గారు, శ్రీ జి.ఎస్. వరదాచారి గారు, శ్రీ సి.వి. చారి గారు, శ్రీ నూతి శంకర రావు గారు, శ్రీ చీకోలు సుందరయ్య గారు, డా. ఆచార్య ఫణీంద్ర తదితరులు పాల్గొని కీర్తిశేషులు ఎమ్. ఎల్ గారికి నివాళులను అర్పించారు.
- డా. ఆచార్య ఫణీంద్ర