ఈ మాసం మనం మరో ఛందస్సులోకి ప్రవేశిద్దాం -
దాని పేరు :" చంపక మాల "
ఉత్పల మాలకు, దీనికి కొంచమే తేడా !
ఉత్పల మాల ట్యూన్ మీకు తెలుసు -
" తానన తాననా తనన తానన తానన తాన తాననా "
ఇక ఇప్పుడు నేర్చుకోబోయే " చంపక మాల " కు ట్యూన్ :
" తననన తాననా తనన తానన తానన తాన తాననా "
( అంటే మొదట్లో ఒక దీర్ఘాక్షరం బదులు రెండు హ్రస్వాక్షరాలు వేయాలన్న మాట. )
ప్రారంభంలో ఒక అక్షరం పెరిగింది కాబట్టి యతి స్థానం ఒక అక్షరం ముందుకు జరుగుతుంది.
ఉత్పల మాలకు యతి 10 వ అక్షరమైతే, దీనికి 11 వ అక్షరం. ప్రాస నియమం ఎలాగూ ఉంటుంది కదా !
అంతే - నాలుగు పాదాలు ఒకే విధంగా వ్రాసుకు పోవడమే !
ఉదాహరణకు నన్నయ గారి పద్య మొకటి చూద్దాం -
నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటె సూనృత
వ్రత యొక బావి మేలు; మరి బావులు నూరిటి కంటె నొక్క స
త్క్రతువది మేలు; తత్క్రతు శతంబున కంటె సుతుండు మేలు; త
త్సుత శతకంబు కంటె నొక సూనృత వాక్యము మేలు సూడగాన్ !
ఇందులో ఒక పాదాన్ని విడమరచి ట్యూన్ తో పోల్చి చూద్దాం -
తననన : నుత జల
తాననా : పూరితం
తనన : బులగు
తానన : నూతులు
తానన : నూరిటి
తాన : కంటె
తాననా : సూనృత*
( * ఇక్కడ ’ సూనృత ’ లోని చివరి అక్షరం ’ త ’ తరువాత, రెండవ పాదం మొదటి అక్షరం ’ వ్ర ’ సంయుక్తాక్షరం కాబట్టి, దాని ముందుండడం వలన ’ త ’ దీర్ఘాక్షర సమానమే అవుతుంది. ఆ విధంగా ’ తాననా ’ ట్యూన్ కి ’ సూనృత ’ సరిపోయింది. ఇలాంటివి ఇది వరకు కూడా చెప్పుకొన్నాం కదా ! )
ఇలాగే ఇదే ట్యూన్ లో మిగితా మూడు పాదాలను కూడా పోల్చి చూసుకోండి.
చంపక మాల పద్యం ట్యూన్ ని, పైన పేర్కొన్న నన్నయ గారి పద్య గమనాన్ని బాగా ఆకళించుకొని, ఆ పైన మీకు తోచిన భావాన్ని చంపక మాల పద్యంలో వ్రాసేందుకు అభ్యాసం చేయండి. పద్యాలను వ్యాఖ్యలుగా అందిస్తే తప్పొప్పులను సరిదిద్ది వివరిస్తాను. All the best !
- డా. ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )
"సందేశ దీపిక" - నిర్వహణ; సంపాదకత్వం : డా. ఆచార్య ఫణీంద్ర, ప్రధాన కార్యదర్శి
11, సెప్టెంబర్ 2009, శుక్రవారం
9, సెప్టెంబర్ 2009, బుధవారం
ఇదండీ ఈయన గారి సంస్కారం !
తెలుగు బ్లాగు మిత్రులారా !
మీకు తెలుసు - ఈ బ్లాగు ద్వారా కొత్తగా పద్యాలు వ్రాయడంపై ఆసక్తి గల వారి కోసం, సులభంగా పద్యాలు వ్రాసే విధానం బోధిస్తూ, అభ్యాసం కొరకు సమస్యల నిచ్చి పూరించమని నేను కోరుతున్న సంగతి. ఆ పరంపరలో భాగంగా, ఈ మాసం, తెలుగు బ్లాగులను ప్రశంసిస్తూ పూరించమని, " బ్లాగులందు తెలుగు బ్లాగులే వేరయా ! " అన్న సమస్య నిస్తే, మన కవి మిత్రులు తమకు తోచిన రీతిలో పూరణలను అందించారు. ఆ పూరణలను చూసి, ఎవరో ’ జల సూత్రం ’ వారట - బ్లాగు నిర్వాహకుడనైన నన్ను, పూరణలను చేసిన కవులను వెటకారం చేస్తూ ఇలా వ్యాఖ్య చేసారు -
[Jalasutram చెప్పారు...
అంతా బానే, అంతా బాగుంది కానీండి, మీ సమస్యా, దానికి తగిన పూరణలు. వందనం, అభివందనం, తకధిమితోం.
ఎందుకో చిలకమర్తివారి పద్యం ఒకటి గుర్తుకొస్తోంది.
తోటకూర దెచ్చి దొడ్డిలోన తరిగి
కుండలోన బెట్టి కుదురుగాను
క్రింద మంటబెట్ట వుడకకేంజేస్తుంది?
దాని కడుపుకాల ధరణిలోన
అని. అదండీ సంగతి. మరి వుంటాను. మళ్ళీ వస్తాను. ఈ మధ్య కవితలన్నీ " అద్భుతం " గా వుంటున్నాయి ఏమిటో ఈ మాయ.
September 9, 2009 6:01 AM ]
ఆ వ్యంగ్యానికి నేనూ వ్యంగ్యంగానే ఇలా సమాధానమిచ్చాను.
[ డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...
అయ్యా ’ జలసూత్రం ’ గారూ !
అవును మరి ! మీకు ఒక చిన్న ’ సమస్యా పూరణం ’ లోనే
’ కాళిదాస కావ్య రసాలు ’, ’ చేమకూర చమత్కారాలు ’ పిండుకోవాలన్న అత్యాశ !
మాకంత పెద్ద ఆశలు లేవు మరి.
అసలే ఇంగ్లీషు మీడియం చదువులతో తెలుగు పద్యాలు వ్రాసే వారే కరువౌతుంటే, మీలాంటి పండితమ్మణ్యులు ఇలా బెదరగొడితే గాని, మీ తరువాతి తరంలో పద్యం నామ రూపాల్లేకుండా చేయ లేరు మరి !
కానీయండి ... ఇంకా విజృంభించండి.
ఎందుకంటే మీరాశించిన స్థాయి పద్య కవులను ఈనాటి ఇంగ్లీషు మీడియం విద్యార్థులనుండి తయారుచేయడం మీ కెలాగూ చేత కాదు.
రోడ్డెక్కితే గదా ఎత్తు పల్లాలలో డ్రైవ్ చేయడం ! రోడ్డే ఎక్కనివ్వకపోతే సరి !
ఏమంటారు ?
September 9, 2009 7:00 AM ]
[ డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...
’ జల సూత్రం ’ వంశాంబుధీ సోమా !
అప్రతిమాన పండిత కవి భీమా !
అన్నట్టు ...
" పది రూపాయలు సన్న బియ్యమన కంపం బెత్తి రాంధ్ర ప్రజల్ ! "
" కసభాధ్యక్ష్యమ్ము దక్కె కాంతామణికే ! "
" అవధానంబొక 'ట్వెంటి ట్వెంటి క్రికెటై' ఆహ్లాదమున్ గొల్పెడిన్ ! "
వంటి సమస్యలిచ్చినపుడు మీరెక్కడున్నారు స్వామీ ?
మీ పూరణలను మాకు కటాక్షించ లేదే !
సరే ! ఇప్పుడైనా ఈ సామాన్య సమస్యను అసామాన్యంగా పూరించి, మా బోంట్లకు వెలుగు చూపవచ్చు కదా !
September 9, 2009 7:21 AM ]
వ్యంగ్యంలో కూడా నా లక్ష్యం ఏమిటో స్పష్టంగా చెబుతూ, ఈనాటి ఇంగ్లీష్ మీడియం చదువుల కాలంలో పద్య కవిత్వంపై ఆసక్తి గలవారిని ప్రోత్సహించ వలసిన అవసరాన్ని నొక్కి చెప్పాను.
ఇతరులపై అలవోకగా వ్యంగ్యాన్ని ఒలకబోసిన ’ జల సూత్రం ’ వారు తనపై వ్యంగ్యాన్ని ప్రయోగిస్తే మాత్రం ఓర్చుకోలేక పోయారు. పొంతన లేని ఉపమానంతో ఆయన ఆక్రోశాన్ని ఎలా వెళ్ళగ్రక్కారో చూడండి.
[Jalasutram చెప్పారు...
వెనకటికి ఒకాయన మాతాత కౌపీనం ఆకాశమంత వుందని అన్నాట్ట. అది విని తట్టుకోలేని ఇంకొకాయన ఒరే మా తాత కౌపీనం కొంచెం చిరిగితే మీ తాత కౌపీనం అతుకెయ్యటానికి పనికొచ్చింది అన్నాడత. అలాగున్నది మన "ఆవు" (కౌ) ల పరిస్థితి.వాచామగోచరంగా ఉంటున్నవి ఈ మధ్య కైతల్లన్నీ. ఆ రసమేమిటి, పాకమేంఇటి, భావమేమిటి, యతులేమిటి, ప్రాసలేమిటి, శబ్దరత్నాకరాలేమిటి - ఒహటా రెండా - వెయ్యితలల ఆదిశేషువే దిగిరావాలి కిందకు. ఇక నేను కపిత్వము చెప్పెదను అని ఎక్కడయినా చెపితినా మాష్టారు ? ఉమ్మెతకాయలు తిన్నవారు ఎక్కువవుతున్నారు ఆవుల(కౌ) లోకంలో అని దీనిభావం. ఆ పైన కాకులు ముట్టని ఉప్పు పిండి అదేనండీ ఉప్పుమాకు తీసిపోకుండా తెగ అల్లుతున్నారు అని వాదించటమే.
పొలములో నక్కలు కూసెగా
మనసులో భయమెంతో వేసెగా
పాలేరు యిట్టట్టె చూసెగా
గంగన్నా నీ ____ మోసెగా
లాగా ఉంటున్నవి మరి - ఏమి " చెప్పు "మందురు !
September 9, 2009 6:52 PM ]
ఇంతా చేసి ఈయన గారికి కవిత్వమే కాదు, కపిత్వం కూడా చేత కాదట. కాని కవులను మాత్రం ’ పశువులు ’ ( ఆవులు - ’ కౌ ’ లు ) అని తిడుతాడట. కవిత్వం నచ్చితే ప్రశంసించడం, నచ్చక పోతే సంస్కరించుకోవడానికి తగిన సలహాలివ్వడం, లేదంటే మిన్నకుండడం - రసజ్ఞుల సంస్కారం. అవేవీ చేత కాక పోయినా, " ఉమ్మెత్త కాయలు తిన్న వారు ", " కాకులు ముట్టిన ఉప్పు పిండి " అంటూ తిట్ల పురాణం మాత్రం ఈయనకు చేతనౌతుంది.
చివరలో " చెప్పు " ను గమనించారా ? - ఇదీ ఈయన గారి సంస్కారం ! నలుగురిలో ఈ కుసంస్కారిని ఎండగడుతూ
ఇదంతా టపాగా ఎందుకు అందిస్తున్నానంటే - నాతోబాటు నా ఈ బ్లాగులో అడుగు పెట్టిన నా అతిథులైన కవి మిత్రులను కూడా తిడుతుంటే, మిన్నకుండడం అమానుషం కాబట్టి.
- డా. ఆచార్య ఫణీంద్ర
మీకు తెలుసు - ఈ బ్లాగు ద్వారా కొత్తగా పద్యాలు వ్రాయడంపై ఆసక్తి గల వారి కోసం, సులభంగా పద్యాలు వ్రాసే విధానం బోధిస్తూ, అభ్యాసం కొరకు సమస్యల నిచ్చి పూరించమని నేను కోరుతున్న సంగతి. ఆ పరంపరలో భాగంగా, ఈ మాసం, తెలుగు బ్లాగులను ప్రశంసిస్తూ పూరించమని, " బ్లాగులందు తెలుగు బ్లాగులే వేరయా ! " అన్న సమస్య నిస్తే, మన కవి మిత్రులు తమకు తోచిన రీతిలో పూరణలను అందించారు. ఆ పూరణలను చూసి, ఎవరో ’ జల సూత్రం ’ వారట - బ్లాగు నిర్వాహకుడనైన నన్ను, పూరణలను చేసిన కవులను వెటకారం చేస్తూ ఇలా వ్యాఖ్య చేసారు -
[Jalasutram చెప్పారు...
అంతా బానే, అంతా బాగుంది కానీండి, మీ సమస్యా, దానికి తగిన పూరణలు. వందనం, అభివందనం, తకధిమితోం.
ఎందుకో చిలకమర్తివారి పద్యం ఒకటి గుర్తుకొస్తోంది.
తోటకూర దెచ్చి దొడ్డిలోన తరిగి
కుండలోన బెట్టి కుదురుగాను
క్రింద మంటబెట్ట వుడకకేంజేస్తుంది?
దాని కడుపుకాల ధరణిలోన
అని. అదండీ సంగతి. మరి వుంటాను. మళ్ళీ వస్తాను. ఈ మధ్య కవితలన్నీ " అద్భుతం " గా వుంటున్నాయి ఏమిటో ఈ మాయ.
September 9, 2009 6:01 AM ]
ఆ వ్యంగ్యానికి నేనూ వ్యంగ్యంగానే ఇలా సమాధానమిచ్చాను.
[ డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...
అయ్యా ’ జలసూత్రం ’ గారూ !
అవును మరి ! మీకు ఒక చిన్న ’ సమస్యా పూరణం ’ లోనే
’ కాళిదాస కావ్య రసాలు ’, ’ చేమకూర చమత్కారాలు ’ పిండుకోవాలన్న అత్యాశ !
మాకంత పెద్ద ఆశలు లేవు మరి.
అసలే ఇంగ్లీషు మీడియం చదువులతో తెలుగు పద్యాలు వ్రాసే వారే కరువౌతుంటే, మీలాంటి పండితమ్మణ్యులు ఇలా బెదరగొడితే గాని, మీ తరువాతి తరంలో పద్యం నామ రూపాల్లేకుండా చేయ లేరు మరి !
కానీయండి ... ఇంకా విజృంభించండి.
ఎందుకంటే మీరాశించిన స్థాయి పద్య కవులను ఈనాటి ఇంగ్లీషు మీడియం విద్యార్థులనుండి తయారుచేయడం మీ కెలాగూ చేత కాదు.
రోడ్డెక్కితే గదా ఎత్తు పల్లాలలో డ్రైవ్ చేయడం ! రోడ్డే ఎక్కనివ్వకపోతే సరి !
ఏమంటారు ?
September 9, 2009 7:00 AM ]
[ డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...
’ జల సూత్రం ’ వంశాంబుధీ సోమా !
అప్రతిమాన పండిత కవి భీమా !
అన్నట్టు ...
" పది రూపాయలు సన్న బియ్యమన కంపం బెత్తి రాంధ్ర ప్రజల్ ! "
" కసభాధ్యక్ష్యమ్ము దక్కె కాంతామణికే ! "
" అవధానంబొక 'ట్వెంటి ట్వెంటి క్రికెటై' ఆహ్లాదమున్ గొల్పెడిన్ ! "
వంటి సమస్యలిచ్చినపుడు మీరెక్కడున్నారు స్వామీ ?
మీ పూరణలను మాకు కటాక్షించ లేదే !
సరే ! ఇప్పుడైనా ఈ సామాన్య సమస్యను అసామాన్యంగా పూరించి, మా బోంట్లకు వెలుగు చూపవచ్చు కదా !
September 9, 2009 7:21 AM ]
వ్యంగ్యంలో కూడా నా లక్ష్యం ఏమిటో స్పష్టంగా చెబుతూ, ఈనాటి ఇంగ్లీష్ మీడియం చదువుల కాలంలో పద్య కవిత్వంపై ఆసక్తి గలవారిని ప్రోత్సహించ వలసిన అవసరాన్ని నొక్కి చెప్పాను.
ఇతరులపై అలవోకగా వ్యంగ్యాన్ని ఒలకబోసిన ’ జల సూత్రం ’ వారు తనపై వ్యంగ్యాన్ని ప్రయోగిస్తే మాత్రం ఓర్చుకోలేక పోయారు. పొంతన లేని ఉపమానంతో ఆయన ఆక్రోశాన్ని ఎలా వెళ్ళగ్రక్కారో చూడండి.
[Jalasutram చెప్పారు...
వెనకటికి ఒకాయన మాతాత కౌపీనం ఆకాశమంత వుందని అన్నాట్ట. అది విని తట్టుకోలేని ఇంకొకాయన ఒరే మా తాత కౌపీనం కొంచెం చిరిగితే మీ తాత కౌపీనం అతుకెయ్యటానికి పనికొచ్చింది అన్నాడత. అలాగున్నది మన "ఆవు" (కౌ) ల పరిస్థితి.వాచామగోచరంగా ఉంటున్నవి ఈ మధ్య కైతల్లన్నీ. ఆ రసమేమిటి, పాకమేంఇటి, భావమేమిటి, యతులేమిటి, ప్రాసలేమిటి, శబ్దరత్నాకరాలేమిటి - ఒహటా రెండా - వెయ్యితలల ఆదిశేషువే దిగిరావాలి కిందకు. ఇక నేను కపిత్వము చెప్పెదను అని ఎక్కడయినా చెపితినా మాష్టారు ? ఉమ్మెతకాయలు తిన్నవారు ఎక్కువవుతున్నారు ఆవుల(కౌ) లోకంలో అని దీనిభావం. ఆ పైన కాకులు ముట్టని ఉప్పు పిండి అదేనండీ ఉప్పుమాకు తీసిపోకుండా తెగ అల్లుతున్నారు అని వాదించటమే.
పొలములో నక్కలు కూసెగా
మనసులో భయమెంతో వేసెగా
పాలేరు యిట్టట్టె చూసెగా
గంగన్నా నీ ____ మోసెగా
లాగా ఉంటున్నవి మరి - ఏమి " చెప్పు "మందురు !
September 9, 2009 6:52 PM ]
ఇంతా చేసి ఈయన గారికి కవిత్వమే కాదు, కపిత్వం కూడా చేత కాదట. కాని కవులను మాత్రం ’ పశువులు ’ ( ఆవులు - ’ కౌ ’ లు ) అని తిడుతాడట. కవిత్వం నచ్చితే ప్రశంసించడం, నచ్చక పోతే సంస్కరించుకోవడానికి తగిన సలహాలివ్వడం, లేదంటే మిన్నకుండడం - రసజ్ఞుల సంస్కారం. అవేవీ చేత కాక పోయినా, " ఉమ్మెత్త కాయలు తిన్న వారు ", " కాకులు ముట్టిన ఉప్పు పిండి " అంటూ తిట్ల పురాణం మాత్రం ఈయనకు చేతనౌతుంది.
చివరలో " చెప్పు " ను గమనించారా ? - ఇదీ ఈయన గారి సంస్కారం ! నలుగురిలో ఈ కుసంస్కారిని ఎండగడుతూ
ఇదంతా టపాగా ఎందుకు అందిస్తున్నానంటే - నాతోబాటు నా ఈ బ్లాగులో అడుగు పెట్టిన నా అతిథులైన కవి మిత్రులను కూడా తిడుతుంటే, మిన్నకుండడం అమానుషం కాబట్టి.
- డా. ఆచార్య ఫణీంద్ర
8, సెప్టెంబర్ 2009, మంగళవారం
సమస్యను పరిష్కరించండి ... ( సెప్టెంబరు 2009 )

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
ఈ మాసం సమస్య :
" బ్లాగులందు తెలుగు బ్లాగులే వేరయా! "
ఇది ’ ఆట వెలది ’ పద్యంలో మొదటి లేక మూడవ పాదంగా ఇముడుతుంది.
తెలుగు బ్లాగులను ప్రశంసించేలా పై పాదాన్ని ప్రయోగిస్తూ ఒక ’ ఆట వెలది ’ పద్యాన్ని పూరించండి.
పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)
3, సెప్టెంబర్ 2009, గురువారం
శాంతి ! ఓం శాంతి ! ఓం శాంతి ! శాంతి ! శాంతి !
23, ఆగస్టు 2009, ఆదివారం
ఈ మాసం పద్య కవిత ... ( ఆగస్టు 2009 )
బాల గణేశునికి వందనం
( ఈ మాసం పద్య కవిత )
" అంకము జేరి శైలతనయా స్తన దుగ్ధము లాను వేళ, బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి, యా
వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడు గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్ ! "

ఇది ’ మను చరిత్రం ’ లో అల్లసాని పెద్దన కవి వ్రాసిన ప్రసిద్ధ గణేశ స్తుతి పద్యం.
అందరిలా మామూలుగా స్తుతిస్తే అది అల్లసాని వారి పద్యం ఎలా అవుతుంది ?
అందుకే పెద్దన కవి అందులో విశేషమైన భావుకతను జోడించి కమనీయమైన స్తుతి పద్యంగా తీర్చిదిద్దాడు.
ఇక ఆ పద్యంలోనారసి చూద్దాం -
బాల గణేశుడు పార్వతీ దేవి ఒడికి చేరి ఆమె పాలు త్రావుతూ, బాల్య చాపల్యంతో తన తొండంతో ఆమె మరొక చన్నును అందుకోబోయి, అదెక్కడుందో కనరాక, అడ్డుగా ఆమె మెడలో ఆభరణంగా ఉన్న నాగరాజును చూచి,"ఇదేమిటి - తామర తూడా?" అన్న అనుమానంతో తాకి చూచే గజాననుని తన ఇష్ట సిద్దికై కొలుస్తానంటాడు కవి.
ఎంత రమణీయమయిన భావన !
ఈ వినాయక చవితి పర్వదినం నాడు ఈ పద్యాన్ని పఠించిన వారందరికీ ఆ విఘ్ననాయకుని కరుణా కటాక్షం ప్రాప్తించి, అభీష్ట సిద్ధి కలుగు గాక !
- డా. ఆచార్య ఫణీంద్ర
( ఈ మాసం పద్య కవిత )
" అంకము జేరి శైలతనయా స్తన దుగ్ధము లాను వేళ, బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి, యా
వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడు గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్ ! "

ఇది ’ మను చరిత్రం ’ లో అల్లసాని పెద్దన కవి వ్రాసిన ప్రసిద్ధ గణేశ స్తుతి పద్యం.
అందరిలా మామూలుగా స్తుతిస్తే అది అల్లసాని వారి పద్యం ఎలా అవుతుంది ?
అందుకే పెద్దన కవి అందులో విశేషమైన భావుకతను జోడించి కమనీయమైన స్తుతి పద్యంగా తీర్చిదిద్దాడు.
ఇక ఆ పద్యంలోనారసి చూద్దాం -
బాల గణేశుడు పార్వతీ దేవి ఒడికి చేరి ఆమె పాలు త్రావుతూ, బాల్య చాపల్యంతో తన తొండంతో ఆమె మరొక చన్నును అందుకోబోయి, అదెక్కడుందో కనరాక, అడ్డుగా ఆమె మెడలో ఆభరణంగా ఉన్న నాగరాజును చూచి,"ఇదేమిటి - తామర తూడా?" అన్న అనుమానంతో తాకి చూచే గజాననుని తన ఇష్ట సిద్దికై కొలుస్తానంటాడు కవి.
ఎంత రమణీయమయిన భావన !
ఈ వినాయక చవితి పర్వదినం నాడు ఈ పద్యాన్ని పఠించిన వారందరికీ ఆ విఘ్ననాయకుని కరుణా కటాక్షం ప్రాప్తించి, అభీష్ట సిద్ధి కలుగు గాక !
- డా. ఆచార్య ఫణీంద్ర
15, ఆగస్టు 2009, శనివారం
స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు !
విశ్వ వ్యాప్తంగా విస్తరిల్లి వెలుగులీనుతున్న భారతీయులందరికీ
63వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు !

అగ్ర భాగమ్ములో అమరి కాషాయంబు,
హరిత వర్ణ మమరి అడుగునందు,
చేరి రెంటి నడుమ శ్వేత వర్ణ, ’మశోక
చక్ర’ మమరి మధ్య చక్కగాను -
పాతాళమందుండి పైపైకి ఎగబ్రాకి
ఆకాశ హర్మ్యాల తాకునట్లు
నిలువెత్తు ధ్వజముపై నిలుచుండి నింగిలో
మన్ననల్ పొందెరా మన పతాక!
పూర్ణ విశ్వమందు పుడమి భారతి మిన్న -
దీటు లేదు భువిని దీని కేది! -
అన్న రీతి నెగిరె ఆకాశమందునన్
మూడు వన్నె లొలుకు ముద్దు జెండ!
63వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు !

అగ్ర భాగమ్ములో అమరి కాషాయంబు,
హరిత వర్ణ మమరి అడుగునందు,
చేరి రెంటి నడుమ శ్వేత వర్ణ, ’మశోక
చక్ర’ మమరి మధ్య చక్కగాను -
పాతాళమందుండి పైపైకి ఎగబ్రాకి
ఆకాశ హర్మ్యాల తాకునట్లు
నిలువెత్తు ధ్వజముపై నిలుచుండి నింగిలో
మన్ననల్ పొందెరా మన పతాక!
పూర్ణ విశ్వమందు పుడమి భారతి మిన్న -
దీటు లేదు భువిని దీని కేది! -
అన్న రీతి నెగిరె ఆకాశమందునన్
మూడు వన్నె లొలుకు ముద్దు జెండ!
9, ఆగస్టు 2009, ఆదివారం
సులువుగా పద్యం వ్రాయండి ... ( ఆగస్టు 2009 )

’ ఉత్పలమాల ’ పద్యాన్ని వ్రాయడం మరికొంత అభ్యాసం చేద్దాం.
ట్యూన్ గుర్తుందిగా ...
" తానన తాననా తనన తానన తానన తాన తాననా "
యతి - 10 వ అక్షరం.
ఇప్పుడొక భావాన్ని ఇస్తాను. దాన్ని ’ ఉత్పలమాల ’ పద్యంలో ఇమిడ్చే ప్రయత్నం చేయండి.
" పాండవులు కూడా సహోదరులే. పాపమని దయజూపి, వారితో యుద్ధమేదీ ఏర్పడవద్దని యెంచుతూ, ఏవో ఐదు ఊళ్ళు, అవీ ... ఎండిన భూములున్నవైనా, ఎందుకూ కొరగానివైనా, నీ గుండెను నిండు చేసుకొని దానం చేయ్ - ఓ సుయోధనా ! " అని శ్రీ కృష్ణుడు రాయబారంలో దుర్యోధనునితో అన్న మాటలను ’ ఉత్పలమాల ’ పద్యంలో పెట్టండి.
మీ అభ్యాస ఫలితంగా వచ్చిన పద్యాలను వ్యాఖ్యలుగా అందించండి. తప్పొప్పులను నేను తెలియజేసి సరిదిద్దగలను. ఇలా సన్నివేశ పరమైన అంశాలను పద్యాల్లో పెట్టగలిగితే, రేపు కావ్యాలను వ్రాయగలిగే శక్తి మీకు వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ? ఉపక్రమించండి.
లేబుళ్లు:
కవిత్వం,
తెలుగు,
తెలుగు పద్యం,
పద్య కవులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
