11, జులై 2013, గురువారం

సాహిత్యాభిమానులకు స్వాగతం

"వి.ఎల్.ఎస్. విజ్ఞాన సారస్వత పీఠం" 8వ వార్షికోత్సవ సందర్భంగా "పద్యకవితా పురస్కార ప్రదానోత్సవం" మరియు "గ్రంథావిష్కరణోత్సవం" కార్యక్రమాల సభ ఆదివారం 14 జూలై 2013 నాడు సాయంత్రం 6 గం||లకు హైదరాబాద్ లోని "రవీంద్ర భారతి" సమావేశ మందిరంలో నిర్వహించబడుతోంది.

పురస్కార గ్రహీతలు :
1. ప్రముఖ కవి శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారు
2. ప్రముఖ కవి, అష్టావధాని శ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారు

ఆవిష్కరింపబడనున్న "ఆచార్య వి.ఎల్.ఎస్. భీమశంకరం" గారి గ్రంథాలు :
1. "ఆత్మీయ కవితా కదంబం" (విస్తృతీకృత ద్వితీయ ముద్రణ)
2. "How Sweet Is Thy Name Rama!" ("శ్రీరామ! నీ నామ మేమి రుచిరా!" పద్య కావ్యానికి ఆంగ్లానువాదం) 

సాహిత్యాభిమానులందరికీ ఇదే మా సాదర స్వాగతం!

- డా. ఆచార్య ఫణీంద్ర
  సాహిత్య సలహాదారు
  వి.ఎల్.ఎస్. విజ్ఞాన సారస్వత పీఠం
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి