17, డిసెంబర్ 2015, గురువారం

చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ గారికి పద్య కవితా పురస్కారం

2016 సంవత్సరానికి గాను మా గురువు గారు - దివంగత మహాకవి డా. నండూరి రామకృష్ణమాచార్య స్మారక పద్య కవితా పురస్కారాన్ని సుప్రసిద్ధ కవయిత్రి శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ గారికి ప్రకటిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. 

 


"భద్రాచల రామదాసు", "మాతృభూమి" వంటి కావ్యాలను రచించిన శ్రీమతి లక్ష్మీనరసమ్మ ( ఖమ్మం జిల్లా, భద్రాచలం వాస్తవ్యురాలు) గారికి 29 ఏప్రిల్ 2016 నాడు హైదరాబాదులో నిర్వహించే డా.నండూరి రామకృష్ణమాచార్య జయంతి సభలో ఈ పురస్కారం ప్రదానం చేయబడుతుంది.  


- డా. ఆచార్య ఫణీంద్ర

  కార్యదర్శి - నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం
  హైదరాబాద్.  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి