6, మే 2020, బుధవారం

సాహితీ సల్లాపాలు - 2 (విన్నవి .. కన్నవి ...)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది 'కరెంట్' కోతల కాలం.‌ ఒక సభలో మహాకవి డా. సి. నారాయణ రెడ్డి గారు ధారాళంగా ప్రసంగిస్తున్నారు. సడెన్ గా కరెంట్ పోయింది. మైక్ పని చేయడం‌ ఆగిపోయింది. ఆయన ప్రసంగించడం ఆపుచేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కాసేపటికి, మళ్ళీ కరెంట్ వచ్చింది. నారాయణ రెడ్డి గారు తన ప్రసంగాన్ని పునఃప్రారంభిస్తూ - "ఈ రోజుల్లో సభలలో ప్రసంగించాలంటే .. విద్వత్ సహకారం ఉంటే సరిపోదు ... విద్యుత్ సహకారం కూడ కావాలి" అన్నారు. శ్రోతలు ఒక్కపెట్టున కరతాళ ధ్వనులను వినిపించారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి