1, ఆగస్టు 2011, సోమవారం

సరస సల్లాపము - 14











మహాకవి శ్రీశ్రీ కి ప్రసిద్ధ కవి ఆరుద్ర వరుసకు మేనల్లుడవుతారు. ఆరుద్ర కొంత శ్రీశ్రీ ప్రభావంతోనే తొలి అడుగులు వేసారని చెప్పవచ్చు. ఆరుద్ర తొలి కావ్యాన్ని శ్రీశ్రీ మెచ్చుకొని ఎంతో ప్రోత్సహించారు. ’తెలంగాణ’ అని ఆరుద్ర పెట్టుకొన్న ఆ కావ్య శీర్షికను ’త్వమేవాహం’ గా మార్చింది కూడా శ్రీశ్రీ యే.

అయితే తరువాతి కాలంలో వాళ్ళిద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. ఆ పైన ఆరుద్ర స్వతంత్ర భావజాలంతో ఎదిగారు.

అలవాటు ప్రకారం శ్రీశ్రీ అడపాదడపా ఇతర కవుల మీద విసుర్లు విసిరినట్టు ( పింగళి గారి సినిమా పాటను మార్చి " ఎంత ఘాటు ప్రేమయో ... ఇంత లేటు వయసులో ..." అనడం, "ప్రధాన మంత్రి కాగోరు - రబీంద్ర నాథ్ టాగోరు", "సినారె... మూసీ కినారె" అని ప్రాసలు ప్రయోగించడం వంటివి అన్న మాట) ఆరుద్ర పైనా విసిరే వారు.

ఇది తెలియని ఒక సాహితీ మిత్రుడు శ్రీశ్రీ తో " మీ శిష్యుడు ఆరుద్ర ... " అంటూ ఏదో చెప్పబోయాడు. వెంటనే శ్రీశ్రీ గట్టిగా నవ్వి - " వాడు నా శిష్యుడు అంటే ... నేనొప్పుకోను. నేను వాడి గురువంటే వాడొప్పుకోడు." అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి