5, మే 2016, గురువారం

నండూరి రామకృష్ణమాచార్య జయంతి సభా విశేషాలు


29/4/2016 నాడు హైదరాబాదులో నారాయణగూడలోని వై.యం.సి.ఏ. ఆడిటోరియంలో జరిగిన మహాకవి కీ.శే. డా. నండూరి రామకృష్ణమాచార్యుల  వారి జయంతి సభలో ప్రముఖ కవయిత్రి, భద్రాచలం వాస్తవ్యురాలు శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ గారికి ఆచార్యుల వారి స్మారక పద్య కవితా పురస్కారాన్ని ప్రదానం చేసారు ఆనాటి ముఖ్య అతిథి - ప్రముఖ పద్యకవి, అంతర్జాతీయ విఖ్యాత భూభౌతిక శాస్త్రవేత్త ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు. ఈ సభకు "తెలుగు అకాడమి" పూర్వ సంచాలకులు డా. వెలచాల కొండలరావు గారు అధ్యక్షత వహించారు. సభలో నండూరి వారు రచించిన పద్య పఠన పోటీలలో విజేతలైన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులను అందజేసారు.

- డా. ఆచార్య ఫణీంద్ర


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి