25, ఏప్రిల్ 2010, ఆదివారం

నండూరి వారి జయంతి సభ

ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా, మా పీఠం ద్వారా ఈ నెల 29 వ తేది నాడు మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్యుల వారి జయంతి సభ హైదరాబాదులో నారాయణగూడ YMCA హాలులో వైభవోపేతంగా నిర్వహించ బోతున్నాం. ఈ సారి ప్రముఖ కవి శ్రీమాన్ 'నల్లాన్ చక్రవర్తుల శేషాచార్యుల' కు నండూరి వారి స్మారక పద్య కవితా పురస్కారం అందజేస్తున్నామని తెలియజేయడానికి ఆనందిస్తున్నాం. ఈ కవి ప్రముఖ బ్లాగరు 'నల్లాన్ చక్రవర్తుల కిరణ్' ( నచకి ) తాత గారని తెలియజేయడానికి మరింత సంతోషిస్తున్నాం. ఈ మారు నండూరి వారి 90 వ జయంతి ( మహా అమృతోత్సవం ) ని పురస్కరించుకొని, వారి పద్య కవితలు 'శీర్ణ మేఖల', 'అజ్ఞాత కౌంతేయం' రెండింటిని ప్రముఖ గాయకులు శ్రీ అమలాపురం కన్నారావు గారిచే గానం చేయించి C.D. లుగా రూపొందించాం. ఆ C.D.లను ఆ రోజు ఆవిష్కరింపజేయడం జరుగుతుంది. సభకు విచ్చేసే ప్రతి ఒక్కరికీ ఆ C.D. ని ఉచితంగా అందజేయాలని మా సంకల్పం. హైదరాబాదు, ఆ పరిసర ప్రాంతాలలోని సాహితీ, సాంస్కృతిక ప్రియులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మా పీఠం తరపున ఆహ్వానిస్తున్నాను.
- డా. ఆచార్య ఫణీంద్ర , ప్రధాన కార్యదర్శి - నం. రా.సాహిత్య పీఠం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి