24, మే 2011, మంగళవారం

రంజింపజేసిన రాగావధానం

‘నవ్య సాహితీ సమితి‘ వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించబడుతున్న వినూత్న, విలక్షణ కార్య్క్రమాలలో భాగంగా నిన్న నగరంలోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో జరిగిన ‘పద్య లీల - గేయ హేల‘ అనే రాగావధాన కార్యక్రమంలో కవి, రాగావధాని ‘చిమ్మపూడి శ్రీరామ మూర్తి‘ పృఛ్ఛకులు ఇచ్చిన గీతమైనా, పద్యమైనా, కోరిన రాగంలోకి అప్పటికప్పుడు మార్చి ఆలపించి, శ్రోతలను ఉర్రూతలూగించారు. రెండు ఆవృత్తులలో జరిగిన ఈ రాగావధానంలో ప్రసిద్ధమైన జయదేవుని అష్టపదులను, అన్నమాచార్య కృతులను, జానపద గేయాలను, తెలుగు గజళ్ళను, లలిత గీతాలను, రంగస్థల పద్యాలను అడిగిన రాగంలో అవధాని అద్భుతంగా గానం చేసి, అతిథులను, సభాసదులను ఆసాంతం అలరించారు. ఈ రోజు ‘సాక్షి‘, ‘ఈనాడు‘ దినపత్రికలలో ప్రచురించబడిన కార్యక్రమ వివరాలు అందిస్తున్నాను.
‘కొత్త పాళీ‘ గారు! మీ కోసం ఈ పోస్టును ప్రత్యేకంగా సమర్పిస్తున్నాను.

- డా. ఆచార్య ఫణీంద్ర

సాక్షి:




ఈనాడు :


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి