28, మే 2011, శనివారం

పద్య కవితా ప్రేమికులారా! స్వాగతం!

మహా కవులకు నివాళిగా దూరదర్శన్ (సప్త గిరి) ఛానల్ నిర్వహించిన ’కవి సమ్మేళనం’లోని అమూల్యమైన కవితల సంకలనంగా రూపొందిన "మహా కవులకు నీరాజనం" గ్రంథావిష్కరణ మహోత్సవం ఆదివారం 29 మే 2011 నాడు హైదరాబాదులోని ’శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం’లో ’ఆంధ్ర పద్య కవితా సదస్సు’ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. వేదిక పై అతిథులతోబాటు గ్రంథంలో కవితల నందించిన డా. పుల్లెల శ్రీరామచంద్రుడు, డా. తిరుమల శ్రీనివాసాచార్య, డా. జె. బాపురెడ్డి మొదలైన అనేక లబ్ధ ప్రతిష్ఠ మహా కవులు పాల్గొనే ఈ విశేష సభకు పద్య కవితా ప్రేమికులు తప్పక విచ్చేసి, కార్యక్రమాన్ని దర్శించి, ఆనందించండి.

- డా.ఆచార్య ఫణీంద్ర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి