16, జులై 2011, శనివారం

సరస సల్లాపము - 11



విజయవాడలో ఒకప్పుడు ’కవి సమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణతోబాటు అనేక లబ్ధ ప్రతిష్ఠులైన సాహితీమూర్తులు ఉండేవారు. వారంతా సాయంత్రం కాగానే ఒక టిఫిన్ సెంటర్ దగ్గర కలుసుకొని, టిఫిన్ చేస్తూ, సాహిత్య చర్చలతోబాటు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొని, చీకటి పడ్డాక ఇళ్ళకు వెళ్ళేవారు.
ఒకనాటి సాయంత్రం విశ్వనాథ వారు టిఫిన్ సెంటర్ వద్దకు కాస్త ఆలస్యంగా చేరుకొన్నారు. ఆలోపే అక్కడకు చేరుకొన్న సాహితీ మిత్రులు ’అట్లు’ వేయించుకొని ఆరగిస్తున్నారు. విశ్వనాథ వారు రాగానే ఒక మిత్రుడు - "మీకూ ’అట్లు’ వేయించమంటారా?" అని అడిగాడు. దానికి విశ్వనాథ వారి సమాధానం - " అట్లే కానిండు! ".

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి