19, జులై 2011, మంగళవారం

సరస సల్లాపము - 12




కొన్ని దశాబ్దాల క్రితం మాట.
ఒక ప్రముఖ పట్టణంలో తెలుగు సాహిత్య సభలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఆనాటి లబ్ధ ప్రతిష్ఠ మహా కవులనందరినీ ఆహ్వానించి, వారికి పెద్ద హోటల్లో బస, అన్ని వసతులను సమకూర్చారు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, మహాకవి శ్రీశ్రీ లకు ప్రక్క ప్రక్క గదుల్లో బస ఏర్పాటు చేయబడింది.
శ్రీశ్రీ గారు ఫ్రెష్ అప్ అయ్యాక, విశ్వనాథ వారిని పలుకరిద్దామని ఆయన గదికి వెళ్ళారు. విశ్వనాథ వారు అప్పుడే స్నానం చేసి, బాత్ రూమ్ నుండి బయటికి వస్తూ శ్రీశ్రీని చూచి లోపలికి ఆహ్వానించి కూర్చోమన్నారు.
కుశల ప్రశ్నల తరువాత, శ్రీశ్రీ చిలిపిగా "నీళ్ళోసుకొన్నారా?" అని ప్రశ్నించారు.
అప్పుడు విశ్వనాథ అంత కన్నా చిలిపిగా "అవును! మీరు కంటున్నారు కదా!" అని సమాధానం చెప్పారు.

1 కామెంట్‌: