9, ఫిబ్రవరి 2013, శనివారం

సరస సల్లాపము - 23

1980 ప్రాంతంలో "ఆధునిక కవిత - అభిప్రాయ వేదిక" అన్న గ్రంథాన్ని రూపొందిస్తూ, ప్రముఖ కవి డా. ఆచార్య తిరుమల - పలువురు ఆధునిక మహాకవులు రచించిన కావ్యాలపై ఆనాటి మహాకవుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఆ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ రచించిన "ఖడ్గ సృష్టి"  కావ్యంపై తన అభిప్రాయం చెప్పమని మరొక మహాకవి గుంటూరు శేషేంద్రశర్మను అడిగారు. దానికి ఆ కవీంద్రుడు ఇచ్చిన సమాధానం -
" అందులో ఖడ్గమూ లేదు - సృష్టీ లేదు. " *

(* ఈ అభిప్రాయం సరైనదా? కాదా? - ఇక్కడ చర్చనీయాంశం కాదు. ఆ కవి పలుకులోని చమత్కారమే ప్రధానం.)

1 కామెంట్‌:

  1. "కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది" అని శ్రీశ్రీ నినదించాక సాహిత్యమే ఖడ్గమని, ఆ సృజననే ఖడ్గసృష్టి అని భావించాలనే శేషేంద్రుల మనోగతం కావచ్చు! ఆనాటి కవులలో సద్విమర్శ, వైరుధ్యాల నడుమ ఘర్షణ సున్నితంగా సునిశితంగా వెలికి వచ్చేవి కదా!?

    రిప్లయితొలగించండి