10, ఫిబ్రవరి 2013, ఆదివారం

సరస సల్లాపము - 24

హైదరాబాదులో "రమ్య సాహితీ సంస్థ" వారి సాహిత్య పురస్కారం స్వీకరించేందుకు వెళ్ళాను. కార్యక్రమానికి ముందు సాహితీ మిత్రులు సాధన నరసింహాచార్య, దత్తాత్రేయ శర్మ, వి.వి. సత్య ప్రసాద్, నేను సరదాగా మాటాడుకొంటున్నాం. మాటలు సినిమాల్లో పతనమవుతున్న విలువల పైకి మళ్ళాయి. "నాటి హీరోయిన్లకు, నేటి హీరోయిన్లకు ఎంత తేడా!" అని నిట్టూర్చారు దత్తాత్రేయ శర్మ గారు. వెంటనే సత్య ప్రసాద్ గారు అందుకొని -"అవునవును ... నాటి హీరోయిన్లు చండీ రాణులు! నేటి హీరోయిన్లు చెడ్డీ రాణులు!!" అన్నారు. అందరం నవ్వుల్లో మునిగి తేలాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి