18, ఫిబ్రవరి 2013, సోమవారం

సరస సల్లాపము - 25



నిన్న ’భక్తి ప్రసూనాలు’, ’పద్య ప్రసాదం’ గ్రంథాల రచయిత వి.వి. సత్యప్రసాద్ గారు కవి మిత్రులందరినీ వారింట్లో భోజనానికి ఆహ్వానించారు. భోజనానికి ముందు అందరు సత్యప్రసాద్ గారి గ్రంథాలలోని పద్య రచనా పాటవాన్ని గురించి మాటాడుతున్నారు.
"సత్య ప్రసాద్ గారి వృత్తి బ్యాంక్ ఉద్యోగమైనా, ప్రవృత్తి అయిన పద్య రచనలో ఎప్పుడూ లెక్క తప్ప లేదు -" అన్నారు సాధన నరసింహాచార్య.
"ఎలా తప్పుతారు? ఆయన చేతిలో ఉండేది ’మని’ అయినా, గుండెలో కొలువుండేది ’ఆమని’ మరి!"  అన్నారు వై. రామకృష్ణారావు గారు!
నాతోబాటు మరి కొందరు కవి మిత్రులు "బాగుంది! బాగా చెప్పారు!" అని స్పందించాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి