12, సెప్టెంబర్ 2009, శనివారం

జంట నగరాల సాహిత్యాభిమానులకు ఆహ్వానం

ప్రాచీన కావ్య ప్రక్రియలలో ’ ఉదాహరణ కావ్యం ’ విశిష్టమైనది. అయితే ఇటీవల పద్య కవులు ఈ ప్రక్రియలో అరుదుగా రచనలు చేస్తున్నారు. ప్రముఖ కవి - ’ ప్రౌఢ పద్య కళానిధి ’ ఆచార్య వి.యల్.యస్. భీమ శంకరం గారు ఇప్పుడు ఒక ఉదాహరణ కావ్యాన్ని రచించారు. దాని పేరు - ’ శ్రీ దక్షారామ భీమేశ్వరోదాహరణ కావ్యము ’.
’ నవ్య సాహితీ సమితి ’, ’ వి.యల్.యస్. సాహిత్య, వైజ్ఞానిక పీఠం ’ సంయుక్తాధ్వర్యంలో ఆ గ్రంథావిష్కరణ సభను నిర్వహిస్తున్నాం.
16 సెప్టెంబరు 2009 నాడు సాయంత్రం 5 - 30 గం || లకు
అశోక్ నగర్ ’ నగర కేంద్ర గ్రంథాలయం ’ ( చిక్కడ పల్లి, హైదరాబాదు ) లో ఈ సభ జరుగుతుంది
జంట నగరాలలో నివసిస్తున్న సాహిత్యాభిమానులు, ముఖ్యంగా పద్య కవితాభిమానులంతా ఆ సభకు విచ్చేసి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
- డా. ఆచార్య ఫణీంద్ర

ఆహ్వాన పత్రం :

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి