మంగళవారం 6 జూలై 2010

సరస సల్లాపం - 2



మా గురువుగారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య గోదావరి జిల్లాలో జన్మించారు. ఆయన గురువుగారు డా. కట్టమంచి రామలింగారెడ్డి రాయలసీమకి చెందినవారు. ఒకరోజు నండూరివారు తమ ప్రాంతానికి చెందిన ఆదికవి నన్నయ గురించి గొప్పగా చెప్పుకపోతున్నారు. అది విని కట్టమంచివారు తమ ప్రాంతానికి దగ్గరలో ఉన్న నెల్లూరుకు చెందిన తిక్కన చాలా గొప్పకవి అని వాగ్వివాదానికి దిగారు. చర్చ కొద్దిగా వేడెక్కింది. రామలింగారెడ్డిగారు " ఏమిటయ్యా మీ నన్నయ గొప్ప ?
పద్యమంతా సంస్కృతం పులమడమేనా ? మా తిక్కనను చూడు - తేట తేట తెలుగు మాటలలో ఎంత చక్కగా వ్రాస్తాడో - " అన్నారు. దానికి నండూరివారు తిక్కన వ్రాసిన "దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ ... " అన్న పద్యాన్ని ఉటంకిస్తూ, " ఇది సంస్కృతం పులమడం కాదేమిటి ? " అని అడిగారు. అప్పుడు రామలింగారెడ్డిగారు ఏం మాట్లాడాలో తెలియక కాసేపు నిశ్శబ్దంగా ఉండి, తరువాత తేరుకొని, " ఆహా ! ద్రౌపదీ ! నీ ఊపిరి తిత్తులు ఎంత బలమైనవి ! " అని నవ్వుతూ అన్నారు. దానితో రామకృష్ణమాచార్యులుగారు కూడా నవ్వాపుకోలేక ఆయనతో శ్రుతి కలిపారు. వాతావరణం ఒక్కసారి చల్లబడింది.

2 వ్యాఖ్యలు:

  1. hhaa.... ha.... ha nijam gaa konni padaalu telugulo palakaalamTe ibbandigaa vumTumdi mari

    ప్రత్యుత్తరంతొలగించు
  2. హను గారు
    తెలుగులో కాదు. కొన్ని సంస్కృత దీర్ఘ సమాసాలు ఏకధాటిగా పలుకడం ఊపిరితిత్తులకు శ్రమతో కూడిన పనే !
    మీకు నా ధన్యవాదాలు !

    ప్రత్యుత్తరంతొలగించు