26, జులై 2010, సోమవారం

ఆణిముత్యం ( జులై 2010 )



చదువుకొన్నవాడు, సంపన్నుడగువాడు
చేయ తప్పు - శిక్ష వేయవచ్చు!
పేదవాని తప్పు ఔదార్య హృదితోడ
సైపవలయు మనుజ సంఘమెల్ల!


ఈ ఆణిముత్యం మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య కలం నుండి జాలువారినది.
విద్యావంతుడు, ధనవంతుడు చేసే తప్పు తెలిసి.. తెలిసి చేసే తప్పు. పైగా "నన్నెవడు అడిగేవాడు?" అన్న అహంకారంతో చేసేది. కాబట్టి అది క్షమార్హం కాదు. కానీ ... పేదవాడు చేసే తప్పు, వాడు చేసేది కాదు. వాని ఆర్థిక స్థితి గతులు వానితో తప్పును చేయిస్తాయి. కాబట్టి ఆ ఆర్థిక అసమానతలకు మూల కారణమైన సంఘానిదే ఆ తప్పు. అందుకే అది శిక్షార్హం కాదు. ఆ తప్పును మనుజ సంఘం తనదిగా భావించి, భరించాలంటారు కవి.
సరళ సుందరంగా, అభ్యుదయాత్మక సందేశం ఇమిడిన ఇలాంటి పద్యాలే మా గురువు గారిని ’ఆధునిక వేమన’గా మన్ననలందుకొనేందుకు దోహదపడ్డాయని నా భావన!

- డా. ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి