7, ఫిబ్రవరి 2009, శనివారం

వార్తా విశేషం

ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా "డా.నండూరి రామకృష్ణమాచార్య జయంతి సభ" ను 29 ఏప్రిల్ 2009 నాడు హైదరాబాదులో నిర్వహించేందుకు నిర్ణయించినట్లు కీ. శే. నండూరి రామకృష్ణమాచార్య శిష్యులు, సాహిత్య పీఠం ప్రధాన కార్యదర్శి డా.ఆచార్య ఫణీంద్ర తెలియజేసారు. ఆ రోజు ఒక ప్రముఖ పద్య కవిని నండూరి వారి స్మారక పురస్కారంతో సత్కరించడంతోబాటు, పద్య పఠన పోటీలో విజేతలైన విద్యార్థులకు బహుమతీ ప్రదానం చేయనున్నట్టు ఆయన వివరించారు. కార్యస్థలం, కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని త్వరలో అందించగలమని డా.ఫణీంద్ర చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి