15, జూన్ 2009, సోమవారం

"ఆణిముత్యం" ... జూన్ 2009

"కుమిలి క్రుళ్ళుచు , నిరుపేద గుడిసె లెల్ల
నేడు కంపు గొట్టుచునుండు నిజము ; కాని
అద్యతన నాగరక హృదయాల కంటె
ఎంత పరిశుభ్రమైనవో ఎంచి చూడ !"


మా గురువు గారు డా || నండూరి రామకృష్ణమాచార్య రచించిన పద్యం ఇది.
నాగరకత పేర పతనమవుతున్న మనుషుల హృదయాల కంటె పేదరికంతో
క్రుళ్ళి ఉన్న slum areas ఎంతో పరిశుభ్రమైనవని ఆచార్యుల వారు ఈ పద్యం
ద్వారా తెలియజెప్పారు. ఎంత చక్కని భావన ! ఎంతటి అభ్యుదయం !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి