15, మార్చి 2009, ఆదివారం

వార్తా విశేషం - (మార్చి 2009)

ప్రఖ్యాత పద్య కవి, పండితులు, తిరుపతి వాస్తవ్యులు శ్రీ 'ముదివర్తి కొండమాచార్య' గారికి, 2009 సంవత్సరానికిగాను 'నండూరి రామకృష్ణమాచార్య స్మారక పద్య కవితా పురస్కారం' అందించడానికి 'నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం' నిర్ణయించిందని 'పీఠం' కార్యదర్శి డా.ఆచార్య ఫణీంద్ర తెలియజేసారు. 2009 ఏప్రిల్ 29 నాడు హైదరాబాదులో జరిగే నండూరి వారి జయంతి సభలో ఈ పురస్కార ప్రదానం జరుగుతుందని ఆయన వివరించారు. ఇదే సభలో పద్య పఠనం పోటీలలో విజేతలైన ఈ క్రింది విద్యార్థినీ , విద్యార్థులకు బహుమతీ ప్రదానం కూడా చేయబడుతుంది అని ఆయన చెప్పారు.
బహుమతీ విజేతల వివరాలు : -
ప్రథమ బహుమతి : జి. రామకిషన్ (నిజామాబాద్)
ద్వితీయ బహుమతి : బి. శ్వేత గౌడ్ (హైదరాబాద్)
తృతీయ బహుమతి : జి. శ్వేత (ఒంగోలు)
ప్రోత్సాహక బహుమతులు : -
1) కే. కుమారా స్వామి (నల్గొండ)
2) ఎం. వెంకన్న (వరంగల్)
3) పి. కుసుమ (మహబూబునగర్)
4) డి. జితేంద్ర (గుంటూరు)
5) కే. మహేష్ (వరంగల్)
సభాస్థలి , కార్యక్రమ వివరాలు త్వరలో తెలుప గలమని డా. ఫణీంద్ర అన్నారు.

2 కామెంట్‌లు:

  1. Just found a peral in the sea, I was searching for this kind of blog since January 2009. Gret work sir.Please continue.

    రిప్లయితొలగించండి
  2. రామిరెడ్డి గారు!
    మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీ ప్రోత్సాహం నాకు వేయింతల బలం.
    - డా|| ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి